Sri Venkateswara Institute of Medical Sciences-SVIMS

Sri Venkateswara Institute of Medical Sciences-SVIMS SVIMS is a Medical Institute and a Multi Speciality Hospital in Tirupati, Andhra Pradesh, India.

తిరుపతితేది : 19-08-2026స్విమ్స్ ఆధ్వర్యంలో జర్నలిస్ట్ కాలని-1, 2లో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరంశ్రీ వెంకటేశ్వర వైద...
19/08/2026

తిరుపతి
తేది : 19-08-2026

స్విమ్స్ ఆధ్వర్యంలో జర్నలిస్ట్ కాలని-1, 2లో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం

శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ(స్విమ్స్) ఆధ్వర్యంలో బుధవారం తిరుపతి ఎర్రమిట్ట అర్బన్ పిహెచ్సీలో జర్నలిస్ట్ కాలని-1, 2 సచివాలయాల పరిధిలోని ప్రజలకు పింక్ బస్ ద్వారా ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ వైద్య శిబిరం నిర్వహించారు. ముందుగా క్యాన్సర్ వ్యాధి లక్షణాలు, ముందస్తు నివారణ చర్యలపై డాక్టర్లు చిత్రపటాల ద్వారా అవగాహన కల్పించారు.

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో తిరుపతి జిల్లాలో పింక్ బస్సుల ద్వారా క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమాలు, మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వేగవంతంగా జరుగుతున్నాయి. పింక్ బస్సులో మహిళలు, పురుషులకు నోటి క్యాన్సర్ పరీక్షలు, మహిళలకు రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం మామోగ్రామ్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం పాప్ స్మియర్ పరీక్షలు నిర్వహించారు.

స్విమ్స్ డైరెక్టర్ కమ్ వైస్ చాన్సలర్ డాక్టర్ ఆర్వీ కుమార్ ఆదేశాల మేరకు కమ్యూనిటి మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ అంజు డి ఆదె మార్గదర్శకత్వంలో నోడల్ ఆఫీసర్లు డాక్టర్ భవాని, డాక్టర్ శివసంతోష్ పర్యవేక్షణలో ఈ వైద్య శిబిరం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఎర్రమిట్ట అర్బన్ పిహెచ్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ యశ్వంత్, పింక్ బస్ మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ పద్మావతి, డాక్టర్ లావణ్య, డాక్టర్ మేఘన, ఏఎన్ఎం రెడ్డి శిరీష, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

-స్విమ్స్ సోషల్ మీడియా

స్విమ్స్, తిరుపతి తేది.18.08.2026క్రిటికల్ కేర్ లో ఉన్న రోగుల నిర్వహణలో హిమోడైనమిక్ మానిటరింగ్ కు ప్రత్యేక ప్రాధాన్యతశ్ర...
18/08/2026

స్విమ్స్, తిరుపతి
తేది.18.08.2026

క్రిటికల్ కేర్ లో ఉన్న రోగుల నిర్వహణలో హిమోడైనమిక్ మానిటరింగ్ కు ప్రత్యేక ప్రాధాన్యత

శ్రీవారి వైద్య సేవలో భాగంగా స్విమ్స్- మెడిసిన్ విభాగం ఆధ్వర్యంలో హీమోడైనమిక్ మానిటరింగ్ వర్క్ షాప్

శ్రీ వేంకట్వేర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) మెడిసిన్ విభాగం ఆధ్వర్యంలో హీమోడైనమిక్ పర్యవేక్షణ, ముఖ్య అంశాలపై వర్క్ షాపును 18.08.2026 వ తేది మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు శ్రీ పద్మావతి ఆడిటోరియంలో నిర్వహించినట్లు మెడికల్ సూపరింటెండెంట్ డా॥ రామ్ గారు తెలియజేశారు.

ఈ కార్యక్రమాన్ని స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్.ఆర్.వి.కుమార్, మెడిసిన్ విభాగాధిపతి మరియు సీనియర్ గ్రేడ్ ప్రొఫెసర్ డాక్టర్.అల్లాడి మోహన్, క్రిటికల్ కేర్ మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్. నటేష్, స్విమ్స్ మెడిసిన్ ప్రొఫెసర్ మరియు ఇండియన్ సొసైటీ క్రిటికల్ కేర్ మెడిసిన్ చైర్ పర్సన్ డాక్టర్.హరికృష్ణ, ఇండియన్ సొసైటీ క్రిటికల్ కేర్ మెడిసిన్ సెక్రటరీలు డాక్టర్.రానా ప్రతాప్, డాక్టర్.మదన్ మోహన్ రెడ్డి గార్లు సంయుక్తంగా జ్యోతిని వెలిగించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

-స్విమ్స్ సోషల్ మీడియా

ఈ సందర్భంగా స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులవతి డా॥ ఆర్.వి. కుమార్ గారు మాట్లాడుతూ... తీవ్రమైన అనారోగ్యంతో ఉన్న రోగుల చికిత్సలో హీమోడైనమిక్ మానిటరింగ్ ఎంతో కీలకమన్నారు. రోగి గుండె పనితీరు, రక్తప్రసరణ స్థితి తదితర అంశాలను సమగ్రంగా అంచనా వేసి, తగిన సమయంలో సరైన చికిత్స అందించేందుకు ఆధునిక హీమోడైనమిక్ మానిటరింగ్ పద్ధతులు ఎంతో ఉపయోగపడతాయని తెలియజేశారు. వైద్య విద్యార్థులు, వీజీ వైద్యులు, వైద్య నిపుణులు ఇటువంటి శిక్షణా కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

స్విమ్స్ మెడిసిన్ విభాగాధిపతి మరియు సీనియర్ గ్రేడ్ డా॥ అల్లాడి మోహన్ గారు మాట్లాడుతూ... రోగి యొక్క హీమోడైనమిక్ స్థితిని కేవలం సాధారణ వైటల్ పారామీటర్ల ఆధారంగా కాకుండా, అందుబాటులో ఉన్న ఆధునిక క్లినికల్ మరియు మానిటరింగ్ పద్ధతుల ద్వారా సమగ్రంగా అంచనా వేయాల్సిన అవసరం ఉందని వివరించారు. సరైన హీమోడైనమిక్ అంచనా ద్వారా రోగికి అవసరమైన చికిత్సను మరింత ఖచ్చితంగా నిర్ణయించవచ్చని తెలిపారు. ముఖ్యంగా క్రిటికల్ కేర్ లో తక్షణ నిర్ణయాలు తీసుకోవడంలో ఈ నైపుణ్యం వైద్యులకు ఎంతో ఉ పయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.

ముఖ్య వక్తగా మరియు నబ్జెక్స్ ఎక్స్ వర్డ్ బెంగళూరులోని సెయింట్ జాన్స్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ లోని క్రిటికల్ కేర్ మెడిసిన్ విభాగంలో ప్రొఫెసర్ డా॥ నటేష్ గారు Hemodynamic Monitoring and Priority Focus in ICU అనే అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరిస్తూ... ఐసీయూలో చికిత్స పొందుతున్న తీవ్ర అనారోగ్య రోగుల్లో రక్తపోటు, హృదయ స్పందన, ఆక్సిజన్ స్థాయి, రక్త ప్రసరణ వంటి హీమోడైనమిక్ అంశాలను నిరంతరం పర్యవేక్షించడం ద్వారా రోగి పరిస్థితిని త్వరగా అంచనా వేసి, అవసరమైన చికిత్సను సకాలంలో అందించవచ్చునని వివరించారు. ఐసీయూలో రోగి ప్రాణాలను కాపాడేందుకు ప్రాధాన్యతా క్రమంలో పర్యవేక్షణ, త్వరితగతిన నిర్ణయాలు, సమయానుకూల చికిత్స ఎంతో కీలకమని ప్రజెంటేషన్ లో వివరించారు. వైద్యులు, నర్సింగ్ సిబ్బంది సమన్వయంతో పనిచేయడం ద్వారా మెరుగైన రోగి సంరక్షణ అందించవచ్చని పేర్కొన్నారు.

మెడిసిన్ విభాగపు ప్రొఫెనర్ డా. జె. హరికృష్ణ గారు మాట్లాడుతూ... క్రిటికల్ గా ఉన్న రోగుల నిర్వహణలో హీమోడైనమిక్ మానిటరింగ్ కు ప్రత్యేక ప్రాధాన్యత ఉందన్నారు. బెడ్ సైడ్ ఎకో వంటి ఆధునిక సాంకేతికతలను క్లినికల్ పరిస్థితులతో అనుసంధానం చేసుకుని ఉపయోగించడం ద్వారా రోగి పరిస్థితిని వేగంగా అర్ధం చేసుకుని తగిన చికిత్స అందించవచ్చని తెలిపారు. ఈ వర్క్ షాపు ద్వారా సైద్ధాంతిక అంశాలతో పాటు ప్రాక్టికల్, క్లినికల్ ప్రదర్శనలకు కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందన్నారు. పాల్గొన్న వైద్యులకు ప్రాక్టికల్ గా ఉపయోగపడే జ్ఞానం, నైపుణ్యాలు లభిస్తాయని పేర్కొన్నారు. రోగుల పరిస్థితిని క్లినికల్ అంచనా వేయడం, అత్యవసర మరియు క్రిటికల్ కేర్ విభాగాల్లో హీమోడైనమిక్ పరామితులను సమర్థవంతంగా పర్యవేక్షించడం వంటి అంశాలపై వర్క్షాపులో అవగాహన కల్పించారు.

ఈ వర్క్ షాపు లో డాక్టర్.భార్గవ్, డాక్టర్.చంద్రశేఖర్ , డాక్టర్.సురేఖ, డాక్టర్.శర్వాణి, డాక్టర్ .బాబు, డాక్టర్ . శ్రీకాంత్, డాక్టర్.మనోజ్ , డాక్టర్. దీప్తి, మెడిసిన్ వైద్యులు, పీజీ విద్యార్థులు మరియు యం.బి.బి. ఎస్ వైద్య విద్యార్థినిలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

-స్విమ్స్ సోషల్ మీడియా

స్విమ్స్, తిరుపతి తేది : 15.08.2026స్విమ్స్ లో ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలుశ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ...
17/08/2026

స్విమ్స్, తిరుపతి
తేది : 15.08.2026

స్విమ్స్ లో ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) 15.08.2026 తేది శనివారం ఉదయం 9.00ని||లకు స్విమ్స్ యూనివర్శిటీ (శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల క్రీడామైదానం నందు ఏర్పాటు చేసిన) 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డా॥ రామ్ గారు తెలియచేశారు.

ఈ సందర్భంగా స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డా॥ ఆర్.వి. కుమార్ గారు జాతీయ పతాకావిష్కరణ గావించి, డాక్టర్లను, విద్యార్థులను, సిబ్బందిని ఉద్దేశ్యించి ప్రసంగిస్తూ, స్వాతంత్య్ర సముపార్జనకు ఎందరో మహానుభావులు అశువులనర్పించారని, వారి స్మరించుట మన కనీస కర్తవ్యంగా పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ వృత్తి పట్ల నిబద్ధతతో క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తామని డా॥ ఆర్. వి.కుమార్ గారు ప్రతిజ్ఞను చేయించగా, సంస్థ ఉద్యోగులు ప్రతిజ్ఞాపాటవాన్ని ఉచ్చరించడం ద్వారా ప్రతినబూనారు. అదేవిధంగా సంస్థ అభివద్ధిని కాంక్షిస్తూ కూడా ప్రతిజ్ఞా కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులవతి డా॥ ఆర్.వి.కుమార్ గారు మాట్లాడుతూ... స్విమ్స్ కుటుంబ సభ్యులందరికి ముందుగా స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతు, రాష్ట్రంలోనే మొదటి స్థానంలో స్విమ్స్ యూనివర్శిటీ వున్నదని చెప్పుకోవడానికి గర్విస్తున్నామన్నారు. తి.తి.దే. సహకారంతో స్విమ్స్ కు ఇంతకమునుపు 60కోట్ల గ్రాంట్ వుండగా దీనిని ప్రస్తుతం 130 కోట్ల రెవిన్యూ గ్రాంటు ఇవ్వడం చాలా సంతోషించదగ్గ విషయమని, దీనికి తి.తి.దే చైర్మన్ శ్రీ బి.ఆర్. నాయుడు గారికి, ఇ.ఓ మరియు జె.ఇ.ఓ గార్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. స్విమ్స్ యస్.ఎ.బి.హెచ్, నర్సింగ్ ఎక్స్ లెన్సీ మరియు ఎన్.ఎ.బి.యల్ కూడా సాధించుకున్నామని, వైద్య సేవలు అందించడమే కాకుండా నాణ్యతమైన సేవలను అందిస్తున్నామని తెలిపారు. సెంట్రల్ గోడౌన్ మరియు పేషెంట్ల సహాయకుల విశ్రాంతి భవనము వినియోగములోకి తీసుకురావడం జరిగిందని, కార్పొరేట్ సెంట్రల్ ఫండ్ తో అత్యాధునికమైన యం.ఆర్.ఐ. పెట్. స్కాన్ ను సమకూర్చుకున్నామని వీటిని ప్రారంభించామని, అలాగే క్యాన్సర్ భవనమును కూడా ఆంధ్రప్రదేశ్ గౌ|| ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు త్వరలో ప్రారంభిస్తారని తెలిపారు. త్వరలో ఆరు పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు స్విమ్స్ కు నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆమోదం తెలిపిందని, అలాగే ఆంధ్రప్రదేశ్ గౌ|| ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, తి.తి.దే వారి ఆదేశాల మేరకు శ్రీవారి వైద్యసేవలను స్విమ్స్ నందు కూడా అమలు చేయడం జరిగిందని, అంతేకాకుండా స్విమ్స్ కు రోజుకు 1400 మంది వరకు వచ్చే పేషెంట్ల సౌకర్యార్ధం స్విమ్స్ విద్యార్ధులచే స్విమ్స్ సేవ విభాగంను ప్రారంభించామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో భాగంగా స్విమ్స్ నందు విశేష ప్రతిభ కనబరచిన ఫ్యాకల్టీ, పి.జి. రెసిడెంట్, యం.బి.బి.ఎస్. ఇంటర్నీస్.. శాశ్వత & అడహాక్ ఉద్యోగులు, టెక్నీషియన్లు, ఫెస్సీ వర్కర్లు, వార్డు బాయ్స్, స్టాఫ్ నర్సులు, సెక్యూరిటీ సిబ్బంది మొత్తం 81 మందికి గాను 50 మంది శాశ్వత ఉద్యోగులకు, 31 మంది ఒప్పంద ఉద్యోగులకు, సర్టిఫికెట్స్ అందచేయడం జరిగింది.

ఈ సందర్భంగా విద్యార్థినిల కోసం ఇండోర్ గేమ్స్ కోసం జిమ్ ను స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డా॥ ఆర్.వి. కుమార్ గారు ప్రారంభించారు.

ఈ సందర్భంగా తి.తి.దే వారి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ గ్రౌండ్ నందు జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమంలో స్విమ్స్ రిజిస్ట్రార్ డా|| అపర్ణ ఆర్ బిట్లా, మెడికల్ సూపరింటెండెంట్ డా॥ రామ్, డిప్యూటీ డైరెక్టర్ డా॥ ఆది క్రిష్ణయ్య, డిప్యూటీ రిజిస్ట్రార్ డా|| ఎర్రమరెడ్డి, నర్సింగ్ సూపరింటెండెంట్ శ్రీమతి ఇందిరమ్మ. ఇ.సి.జి టెక్నిషియన్ మహాలింగం గార్లకు తిరుమల తిరుపతి దేవస్థానముల చైర్మన్ శ్రీ బి. ఆర్. నాయుడు మరియు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ ముద్దాడ రవిచంద్ర గారి చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందుకున్నారు.

తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ డా. యస్. వెంకటేశ్వర్ గారి చేతుల మీదుగా స్విమ్స్ మెడిసిన్ విభాగాధిపతి మరియు సీనియర్ గ్రేడ్ ప్రొ॥ డా|| అల్లాడి మోహన్ గారు ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు.

ఈ కార్యక్రమంలో స్విమ్స్ వైద్యులు, వైద్య మరియు వైద్యేతర సిబ్బంది, వివిధ విభాగాధిపతులు, విద్యార్థినీ విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

-స్విమ్స్ సోషల్ మీడియా

తిరుపతితేది : 13-08-26స్విమ్స్ ఆధ్వర్యంలో శంకర్ కాలని-1, 2లో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరంశ్రీ వెంకటేశ్వర వైద్య విజ్...
13/08/2026

తిరుపతి
తేది : 13-08-26

స్విమ్స్ ఆధ్వర్యంలో శంకర్ కాలని-1, 2లో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం

శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ(స్విమ్స్) ఆధ్వర్యంలో గురువారం తిరుపతి ఎర్రమిట్ట అర్బన్ పిహెచ్సీ పరిధిలోని రత్నం స్కూల్లో శంకర్ కాలని-1, 2(శివజ్యోతినగర్) సచివాలయాల పరిధిలోని ప్రజలకు పింక్ బస్ ద్వారా ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ వైద్య శిబిరం నిర్వహించారు. ముందుగా క్యాన్సర్ వ్యాధి లక్షణాలు, ముందస్తు నివారణ చర్యలపై డాక్టర్లు చిత్రపటాల ద్వారా అవగాహన కల్పించారు.

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో తిరుపతి జిల్లాలో పింక్ బస్సుల ద్వారా క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమాలు, మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వేగవంతంగా జరుగుతున్నాయి. పింక్ బస్సులో మహిళలు, పురుషులకు నోటి క్యాన్సర్ పరీక్షలు, మహిళలకు రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం మామోగ్రామ్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం పాప్ స్మియర్ పరీక్షలు నిర్వహించారు.

స్విమ్స్ డైరెక్టర్ కమ్ వైస్ చాన్సలర్ డాక్టర్ ఆర్వీ కుమార్ ఆదేశాల మేరకు కమ్యూనిటి మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ అంజు డి ఆదె మార్గదర్శకత్వంలో నోడల్ ఆఫీసర్లు డాక్టర్ భవాని, డాక్టర్ శివసంతోష్ పర్యవేక్షణలో ఈ వైద్య శిబిరం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఎర్రమిట్ట అర్బన్ పిహెచ్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ యశ్వంత్, పింక్ బస్ మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ పద్మావతి, డాక్టర్ హరిత, డాక్టర్ లావణ్య, డాక్టర్ మేఘన, ఏఎన్ఎంలు అరుణ, ధనమ్మ, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

-స్విమ్స్ సోషల్ మీడియా

స్విమ్స్, తిరుపతి తేది : 13.08.2026స్విమ్స్ ఆధ్వర్యంలో జాతీయ అవయవదాన దినోత్సవ సందర్భంగా అవగాహన ర్యాలీ'అన్ని దానాల కన్నా ...
13/08/2026

స్విమ్స్, తిరుపతి
తేది : 13.08.2026

స్విమ్స్ ఆధ్వర్యంలో జాతీయ అవయవదాన దినోత్సవ సందర్భంగా అవగాహన ర్యాలీ

'అన్ని దానాల కన్నా అవయవ దానం మిన్న'
------ స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డా॥ ఆర్.వి.కుమార్ గారు

శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) నందు 13.08.2026వ తేది గురువారం ఉదయం 9.00 గంటలకు స్విమ్స్ యన్.టి.ఆర్ సర్కిల్ నుండి వాల్మికి సర్కిల్ వరకు జాతీయ అవయవదాన దినోత్సవ అవగాహన ర్యాలీ నిర్వహించినట్లు స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డా॥ రామ్ గారు తెలియజేశారు.

ఈ కార్యక్రమాన్ని స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డా॥ ఆర్.వి. కుమార్ గారు జెండా ఊపి ప్రారంభించారు.

స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డా॥ ఆర్.వి.కుమార్ గారు ప్రసంగిస్తూ.... మనిషి మరణించిన కూడా వారి అవయవాల ద్వారా జీవించే భాగ్యం అవయవ దానం ద్వారా మాత్రమే సాధ్యమైతుందని పేర్కొన్నారు. మనిషి జీవించి వున్నప్పుడు కిడ్నీ, లివర్ పనిచేయకపోయి మరి ఏ చికిత్సకు పనిచేయని సందర్భంలో ఈ అవయవ మార్పిడి అవసరం అవుతుందని, వీటికి వేరే మనిషి అవయవాలను దానం చేయడం తప్ప వేరే మార్గంలేదని, అందువల్ల ఎవరైన బ్రెయిన్ డెడ్ అయిన మనిషి అవయవాలను దానం చేయవలసిందిగా ప్రోత్సహించాలని కోరారు. స్వచ్ఛందంగా అవయవ దానం నమోదు చేసుకోదలచిన వారు https://notto.abdm.gov.in/ ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. అవయవదానంపై ఉన్న అపోహలు తొలిగించేందుకు విద్యార్థిని, విద్యార్థులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అవయవదానం చేయడంపై అపోహలు కలిగి వుంటారని వీరికి పారామెడికల్ సిబ్బంది, నర్సులు వారికి సరైన అవగాహన కల్పించి అవయవదానం చేసే విధంగా ప్రోత్సహించాలని తెలియజేశారు.

జాతీయ అవయదాన వారోత్సవాలలో భాగంగా స్వచ్చందంగా అవయవదాన రిజిస్ట్రేషన్లు నమోదు చేసుకోవడం జరిగింది.

జాతీయ అవయవదాన దినోత్సవ కార్యక్రమానికి నిర్వహకులుగా ఎం.ఎస్.డబ్ల్యూ ప్రసాద్ గారు మరియు వారి సిబ్బంది వ్యవహరించారు.

ఈ కార్యక్రమంలో మెడికల్ సూపరింటిండెంట్ డా॥ రామ్, ఆర్.యం.ఓ డా॥ కోటిరెడ్డి, డా॥ సతీష్, యస్.పి.యం.సి.డబ్ల్యూ ప్రిన్సిపాల్ డా॥ ఉమామహేశ్వరరావు, అలైడ్ హెల్త్ సైన్స్స్ ప్రిన్సిపాల్ డా|| మధుబాబు, ఫిజియోథెరఫి కళాశాల ప్రిన్సిపాల్ డా॥ కె.మాధవి, కార్డియాలజీ విభాగాధిపతి డా॥ వనజాక్షమ్మ కమ్యూనిటీ మెడిసిన్ డా|| లలిత్, పి.ఆర్.ఓ వి. రాజశేఖర్, సెక్యూరిటి, విద్యార్థిని విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

-స్విమ్స్ సోషల్ మీడియా

12/08/2026

స్విమ్స్ - కంటి వైద్య విభాగం ఆధ్వర్యంలో శ్రీ భారతీయ విద్యా భవన్స్ స్కూల్ నందు ఉచిత వైద్య శిభిరం.

-స్విమ్స్ సోషల్ మీడియా

స్విమ్స్, తిరుపతితేది : 12-08-2026ఆధ్యాత్మిక సాధనతో యువత సర్వతోముఖాభివృద్ధి-శ్రీశ్రీశ్రీ రమ్యానంద భారతి స్వామిని-స్విమ్స...
12/08/2026

స్విమ్స్, తిరుపతి
తేది : 12-08-2026

ఆధ్యాత్మిక సాధనతో యువత సర్వతోముఖాభివృద్ధి

-శ్రీశ్రీశ్రీ రమ్యానంద భారతి స్వామిని

-స్విమ్స్‌లో ఘనంగా ‘అంతర్జాతీయ యువజన దినోత్సవం’

నేటి యువత ఆధ్యాత్మిక మార్గంలో పయనించడం ద్వారా మానసికంగా, మేధోపరంగా ఉన్నతి సాధించగలుగుతారని శక్తి పీఠం మాతాజీ శ్రీశ్రీశ్రీ రమ్యానంద భారతి స్వామిని ఉద్ఘాటించారు. శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) నందు 12.08.2026వ తేది బుధవారం మధ్యాహ్నం 3.00 గంటలకు శ్రీ పద్మావతి ఆడిటోరియంలో అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని నిర్వహించినట్లు డా॥ మెడికల్ సూపరింటెండెంట్ డా॥ రామ్ గారు తెలియజేశారు.

ఈ సందర్భంగా శ్రీశ్రీశ్రీ రమ్యానంద భారతి స్వామిని అనుగ్రహ భాషణం చేస్తూ ప్రతి ఒక్కరూ విద్యార్థి దశ నుండే మంత్రం, ధ్యానం, ఆలయ సందర్శన అలవర్చుకోవాలన్నారు. మంత్ర పఠనం ద్వారా మనస్సు శుద్ధి, ధ్యానం ద్వారా ఏకాగ్రత, ఆలయసందర్శన ద్వారా దివ్యశక్తి చేకూరుతాయని వివరించారు. మంచి ఆలోచనల ద్వారా ఆరోగ్యం, చెడు ఆలోచనల ద్వారా అశాంతి కలుగుతుందన్నారు. ఈ రోజుల్లో సాంకేతికత పెరిగింది కానీ మానసిక ప్రశాంతత కరువైందని, దీనికి కారణం ధర్మాన్ని, సంస్కృతిని మర్చిపోవడమేనని చెప్పారు. భగవంతునిపై పరిపూర్ణమైన నమ్మకం ఉంచితే, జీవితంలో వచ్చే ఎలాంటి కష్టాలనైనా అధిగమించే దివ్యమైన జ్ఞానం మనకు లభిస్తుందన్నారు.

స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డా. ఆర్.వి. కుమార్ గారు మాట్లాడుతూ...మంత్రపఠనంలో సైన్స్ దాగివుందని, సరైన మార్గంలో గురువుల పర్యవేక్షణలో సాధన చేస్తే మంచి ఫలితాలు వస్తాయని ఇది అనుభవ పూర్వకంగా నిరూపితమైనదని తెలియజేశారు. పరమ పూజ్యశ్రీ రమ్యానంద భారతి స్వామిని గారు ఆధ్యాత్మిక సందేశాలు, సనాతన ధర్మ సూత్రాల ఆధారంగా ఒక చక్కని ఉపన్యాసం ఇచ్చారని విద్యార్థులు మాతాజి గారు చెప్పిన విషయాలను తప్పకుండా పాటించాలని సూచించారు.

ఈ సందర్బంగా మాతాజి గారిని విద్యార్థులు అడిగిన వివిధ ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్బంగా విద్యార్థులకు నిర్వహించిన పోస్టర్ ప్రెజంటేషన్, వ్యాస రచన, చర్చావేదిక, క్విజ్ పోటీల్లో విజేతలకు పూజ్యశ్రీ రమ్యానంద భారతి స్వామిని సర్టిఫికెట్స్, బహుమతులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో డీన్ డా. అలోక్ సచన్, రిజిస్ట్రార్ డా. అపర్ణ ఆర్ బిట్లా, మెడికల్ సూపరింటెండెంట్ డా. రామ్, యస్. పి. యం. సి. డబ్ల్యూ కాలేజ్ ప్రిన్సిపాల్ డా. ఉమామహేశ్వర రావు, నర్సింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్ డా. సుధారాణి, ఫిజియో థెరపి కాలేజ్ ప్రిన్సిపాల్ డా. మాధవి, అల్లైడ్ హెల్త్ సైన్సెస్ కాలేజ్ ప్రిన్సిపాల్ డా. మధుబాబు, కార్డియాలజీ విభాగాధిపతి వనజాక్షమ్మ, బయో ఇన్ఫర్మేటిక్స్ విభాగాధిపతి డా.ఉమామహేశ్వరి, బయోటెక్నాలజీ విభాగాధిపతి శర్మ, యస్. పి. యం. సి. డబ్ల్యూ వైస్ ప్రిన్సిపాల్ డా. శర్వాణి, మెడిసిన్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డా॥ శ్రీరమ్య, డిప్యూటీ రిజిస్ట్రార్ డా. ఎర్రంరెడ్డి మరియు వివిధ విభాగాధిపతులు, వైద్యులు, విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

-స్విమ్స్ సోషల్ మీడియా

స్విమ్స్, తిరుపతి తేది : 11.08.2026                                                                                     ...
11/08/2026

స్విమ్స్, తిరుపతి
తేది : 11.08.2026
స్విమ్స్ యూజీ వైద్య విద్యార్థినులకు ఇంటెర్నిషిప్ ఓరియెంటేషన్ ప్రోగ్రాం
శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) కు అనుబంధంగా వున్న శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల నందు 11.08.2026 వ తేది మంగళవారం ఉదయం 9 గం. లకు MBBS final year ఉత్తీర్ణత సాధించిన 2021-22 బ్యాచ్ మొత్తం 163 మంది ఇంటర్నిస్ విద్యార్థినులకు ఒరింటేషన్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగిందని మెడికల్ సూపరింటెండెంట్ డా. రామ్ గారు తెలిపారు.

ఈ కార్యక్రమాన్ని స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డా ఆర్. వి. కుమార్ గారు, డీన్ డా. అలోక్ సచన్, రిజిస్ట్రార్ డా. అపర్ణ ఆర్ బిట్లా, మెడిసిన్ విభాగాధిపతి డా. అల్లాడి మోహన్, శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ డా|| కె. ఉమామహేశ్వర రావు, వైస్ ప్రిన్సిపాల్స్ డా.శర్వాణి, డా. విజయలక్ష్మి, ఆర్. యం. ఓ . సతీష్ మరియు జనరల్ సర్జరీ డా|| శ్రీహరి రావు గార్లు సంయుక్తంగా జ్యోతిని వెలిగించి ప్రారంభించారు .

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్ వి కుమార్ గారు మాట్లాడుతూ .... ముందుగా ఇంటర్నేస్ కి శుభాకాంక్షలు అందించారు. ఇంటర్నేషిప్ సమయాన్ని పీజీ ప్రిపరేషన్ సమయంగా కాకుండా బెడ్ సైడ్ స్కిల్స్, ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ మొదలైన వాటిలో అనుభవం సాధించాలని పేర్కొన్నారు. చికిత్స చేసి ప్రాణం కాపాడే దేవుడిగా డాక్టర్లు నమ్ముతారని ఆ నమ్మకాన్ని ప్రతి వైద్యురాలు నిలబెట్టుకోవాలని పేర్కొన్నారు. ప్రాణాలు కాపాడటానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండే వారే వైద్యులని తెలిపారు.

శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ డాక్టర్ ఉమామహేశ్వరరావు గారు మాట్లాడుతూ... ఎం.బి. బి.ఎస్ విద్యను పూర్తిచేసి ఇంటర్నేషిప్ లోకి అడుగుపెడుతున్న మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.ఇంటర్నెట్ షిప్ అనేది మీరు నేర్చుకున్న వైద్య పరిజ్ఞానాన్ని ఆచరణలో ఉపయోగించి క్లినికల్ నైపుణ్యం పెంపొందించుకునే ముఖ్యమైన దశ అని పేర్కొన్నారు.
రోగి భద్రతకు ప్రాధాన్యతనిస్తూ రోగులు మరియు సిబ్బందితో గౌరవంగా మానవతా దృక్పథంతో వ్యవహరించాలని పేర్కొన్నారు. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సీనియర్ వైద్యుల మార్గదర్శకంలో నేర్చుకుని మంచి వైద్యులు గా ఎదగాలని కోరారు.

మెడిసిన్ విభాగాధిపతి మరియు సీనియర్ గ్రేడ్ ప్రొఫెసర్ డాక్టర్ అల్లాడి మోహన్ గారు మాట్లాడుతూ...ఇంటర్నేషిప్ సమయంలో ఒత్తిడి జయించడం, పరిశోధనలకు ప్రాధాన్యత ఇవ్వడం తదితర అంశాలపై ఇంటర్నేస్ కు పలు సూచనలు చేశారు. వైద్యాన్నిధనార్జనే ధ్యేయంగా కాకుండా సమాజ సేవకు పేదల కోసం వినియోగించాలని కోరారు. ఇంటర్నెస్ అకాడమిక్ పరిజ్ఞానంతో పాటు మానవతా విలువలు సేవా దృక్పథం క్రమశిక్షణను అలవర్చుకోవాలని ఆయన సూచించారు. రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించే బాధ్యత ప్రతి వైద్యురాలిపై ఉందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో స్విమ్స్ విభాగాధిపతులు అధ్యాపకులు పీజీ వైద్యులు తదితరులు పాల్గొన్నారు.

-స్విమ్స్ సోషల్ మీడియా

స్విమ్స్, తిరుపతి తేది: 11.08.2026స్విమ్స్ - సర్జికల్ ఆంకాలజీ మరియు ఇండియన్ క్యాన్సర్ సొసైటీ వారి సంయుక్త ఆధ్వర్యంలో క్య...
11/08/2026

స్విమ్స్, తిరుపతి
తేది: 11.08.2026

స్విమ్స్ - సర్జికల్ ఆంకాలజీ మరియు ఇండియన్ క్యాన్సర్ సొసైటీ వారి సంయుక్త ఆధ్వర్యంలో క్యాన్సర్ పేషంట్లకు నూట్రీషియన్ కిట్లు పంపిణి

శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) సర్జికల్ అంకాలజీ విభాగం మరియు ఇండియన్ క్యాన్సర్ సోసైటీ బెంగుళూరు వారి సంయుక్త ఆధ్వర్యంలో 11.08. 2026వ తేది మంగళవారం ఉదయం 11.00 గంటలకు శ్రీ పద్మావతి మహిళా వైద్యకళాశాల హాస్పిటల్ సర్జికల్ అంకాలజీ విభాగం నందు న్యూట్రిషియన్ల కిట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించినట్లు స్విమ్స్ మెడికల్ సూపరిటెండెంట్ డా॥ రామ్ గారు తెలియజేశారు.

సర్జికల్ ఆంకాలజీ విభాగాధిపతి డా॥ నరేంద్ర గారు మాట్లాడుతూ... ముఖ్యంగా క్యాన్సర్ పేషంట్లు తీసుకొనే ఆహార పదార్థాలు,ప్రొటీన్ పౌడర్) న్యూట్రీషియన్ కిట్లు ను సి.ఎస్.ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ) ఇంటర్నేషనల్ ఫ్లేవర్స్ అండ్ ఫ్రాగ్రెన్సెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారి సహకారంతో స్విమ్స్ లోని క్యాన్సర్ పేషంట్లకు, ఐ.సి.ఎస్(ఇండియన్ క్యాన్సర్ సొసైటీ బెంగళూరు) వారు పౌష్టికాహార కిట్లు ను పంపిణీ చేశారు.

స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డా॥ ఆర్.వి.కుమార్ గారు మాట్లాడుతూ... క్యాన్సర్ పేషంట్లు ఆహారం తీసుకోవడంలో ఇబ్బందులుంటాయని, కావున ఈ ప్రోట్రీన్ పౌడర్ తీసుకోవడం ద్వారా త్వరగా కోలుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ రోజు 50 మంది పేషంట్లకు న్యూట్రీషియన్ కిట్లను పంపిణీ చేయడం జరిగింది. ఒక్కొక్క పేషంటికి 5000రూ. విలువ గల పౌష్టికాహార కిట్లును అందించడం జరిగిందన్నారు. వైద్యుల సలహా మేరకు ఒక్కొక్క పేషంట్ కు న్యూట్రీషియన్ కిట్లు 60 రోజుల పాటు వాడుకోవచ్చునని తెలిపారు. ప్రతి నెల 50 మందికి చొప్పున తొమ్మిది నెలల పాటు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు.

సి.ఇ.ఓ. ఐ.సి.ఎస్, బెంగుళూరు డా॥ గురుసుహాన్ గారు మాట్లాడుతూ... క్యాన్సర్ పేషంట్లు ఆహారం తీసుకోవడం చాలా తక్కువగా వుంటుందని అందువల్ల ఈ న్యూట్రీషియన్ కిట్లును పంపిణీ చేయడం జరిగిందన్నారు.

సి.ఎస్.ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) లీడ్ శ్రీ కార్తీక్ పళణి గారు మాట్లాడుతూ... ఈ ప్రోటీన్ పౌడర్ ను గత మూడు సంవత్సరాలుగా చైన్నై తెలంగాణా రాష్ట్రాలలో పంపిణీ చేస్తున్నామని, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిగా స్విమ్స్ హాస్పిటల్ నందు క్యాన్సర్ పేషంట్లకు ఈ ప్రోటీన్ పౌడర్ అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమంను ప్రారంభించడం జరిగిందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఐ.సి.ఎస్ ప్రాజెక్టు లీడ్ డా॥ స్వాతి, కో-ఆర్డినేటర్ శ్రీ రఘనాధ్, సర్జికల్ ఆంకాలజీ ప్రొఫెసర్ డా॥ మణిలాల్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డా॥ కిషోర్, డా॥ రమేష్ బాబు మరియు సర్జికల్ ఆంకాలజీ వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

-స్విమ్స్ సోషల్ మీడియా

స్విమ్స్, తిరుపతి తేది : 11.08.2026 స్విమ్స్ - కంటి వైద్య విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిభిరం శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్...
11/08/2026

స్విమ్స్, తిరుపతి
తేది : 11.08.2026

స్విమ్స్ - కంటి వైద్య విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిభిరం

శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) కంటి వైద్య విభాగం వారి ఆధ్వర్యంలో శ్రీ భారతీయ విద్యా భవన్స్ స్కూల్ నందు 11.08.2026వ తేది మంగళవారం ఉదయం 10:00 గంటలకు ఉచిత కంటి వైద్య శిభిరం నిర్వహించినట్లు స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డా॥ రామ్ గారు తెలియజేశారు.

స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డా॥ ఆర్.వి.కుమార్ గారు, ఆప్తమాలజీ విభాగాధిపతి డా॥ రమ్యదీప్తి, యస్.పి.యం.సి.డబ్య్లూ ప్రిన్సిపాల్ డా.ఉమామహేశ్వరరావు, రేడియాలజీ విభాగాధిపతి డా॥ విజయలక్ష్మి, డా॥ శర్వాణి, ఆప్తమాలజీ అసోసియేట్ ప్రొ॥ డా॥ప్రభంజన్ కుమార్, డా॥ తేజశ్విని, డా॥ అక్షిత, భారతీయ విద్యా భవన్స్ డైరెక్టర్ డా॥ సత్యనారాయణ రాజు, ప్రిన్సిపాల్ పద్మజ గార్లు పాల్గొన్నారు.

స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డా॥ ఆర్.వి.కుమార్ గారుమాట్లాడుతూ ... స్విమ్స్ కంటి వైద్య విభాగం ఆధ్వర్యంలో 4రోజుల పాటు భారతీయ విద్యా భవన్స్ విద్యార్ధులకు కంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, రోజుకు 250 పైగా విద్యార్ధులకు కంటి పరీక్షలు చేస్తారని, వీరిలో కంటి సమస్యలు ఉన్న వారిని స్విమ్స్ ఆప్తమాలజీ విభాగానికి రెఫర్ చేసి వారికి డా॥ ఎన్.టి.ఆర్.వైద్యసేవ ద్వారా ఉచిత వైద్యం అందించడం జరుగుతుందని తెలిపారు.
ఆప్తమాలజీ విభాగాధిపతి డా॥ రమ్యదీప్తి గారు మాట్లాడుతూ పిల్లలలో ఉండే కంటి సమస్యల గురించి అవగాహనతో పాటు వాటిని గురించి పిల్లలకు వివరించి కంటి సంరక్షణ గురించి తెలియజేశారు.
భారతీయ విద్యా భవన్ డైరెక్టర్ డా॥ సత్యనారాయణ రాజు గారు మాట్లాడుతూ... స్విమ్స్ ఆధ్వర్యంలో నాలుగురోజుల పాటు జరిగే ఉచిత కంటి పరీక్షలకు విద్యార్ధులు సద్వినియోగం చేసుకోవాలని, ఈ ఉచిత వైద్య శిభిరానికి అంగీకరించిన స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డా॥ ఆర్.వి.కుమార్ గారికి మరియు వారి వైద్యబృందానికి కృతజ్ణతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఆప్తమాలజీ విభాగపు వైద్యులు, విద్యార్ధులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

-స్విమ్స్ సోషల్ మీడియా

Address

Alipiri Road
Tirupati
517507

Alerts

Be the first to know and let us send you an email when Sri Venkateswara Institute of Medical Sciences-SVIMS posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Sri Venkateswara Institute of Medical Sciences-SVIMS:

Shortcuts

Share